స్వీటి అనుష్క సినిమా కెరీర్ లో అరుంధతి కి ముందు అరుంధతి కి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాతో స్వీటి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అవడమే కాదు ఇలాంటి పాత్రలు పోషించాలంటే అనుష్క తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్టుగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక మన సౌత్ సినిమాకి అన్ని రకాలుగా గొప్పకాలం నడుస్తుందని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మన సినిమాల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ రీమేక్ లు చేస్తున్నారు హిందీ దర్శక, నిర్మాతలు. ఆ కోవలోనే  ఇప్పటికే పలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ల రీమేక్ రైట్స్ ని హిందీ ఫిలింమేకర్స్ దక్కించుకుంటున్నారు. తెలుగులోనూ హిందీ సినిమాల రీమేక్ లు పెరిగాయి. మన దర్శకనిర్మాతలు హిందీ సినిమాల రీమేక్ రైట్స్ ని కొనుక్కుంటున్నారు.

ఇక దాదాపు పదేళ్ళ క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన అరుంధతి సినిమాని ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే అవన్ని మొదట్లోనే ఆటంకం కలిగి ఆగిపోయాయి. అరుంధతి హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకుని కూడా ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా హవా చూశాక మళ్ళీ అరుంధతి గుర్తొచ్చింది. ఇంతకాలానికి అరుంధతి రీమేక్ ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందని తాజా సమాచారం. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కలిసి ఈ సినిమాని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో జేజమ్మగా కరీనాకపూర్ నటించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం. 

ఒకవేళ కరీనా కాదు అనుకుంటే అనుష్క శర్మను సంప్రదించాలని నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారట. కరీనా ఇప్పటికే ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు బుల్లితెర హోస్ట్ గా రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తక్త్-గుడ్ న్యూస్- అంగ్రేజీ మీడియం సినిమాల్లో నటిస్తున్న కరీనా తన కాల్షీట్లను కేటాయించాలంటే ఎంతకాదన్నా కనీసం సంవత్సరం  పడుతుందట. అందుకే కరీనా తర్వాత ఛాయిస్ అనుష్క శర్మకే వెళ్లే అవకాశం ఉందని ఫ్రెష్ అప్‌డేట్. ఇక గడిచిన పదేళ్ల తో పోలిస్తే టెక్నాలజీ పరంగా వీఎఫ్ ఎక్స్ పరంగా చాలా మార్పులొచ్చాయి. ఇప్పటి స్టాండర్డ్స్ లో పాన్ ఇండియా సినిమాగా తీయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: