ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ ఎంట్రీస్ కి మన తెలుగు సినిమా ఎంపికైంది అంటే అంతకంటే గొప్ప వార్త మరేదైనా ఉంటుందా. రౌడీ బోయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ (2019) ఆస్కార్ బరిలో ఇండియా తరపు నుంచి పోటీ పడేందుకు పరిశీలనకు వెళ్లిందని లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతానికి విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇండియా తరపున 28 సినిమాల జాబితా లో డియర్ కామ్రేడ్ ఒకటిగా ఉండటం ఇప్పుడు మన టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరు ఈ విషయం మీదే చర్చించుకుంటున్నారు.

ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ప్రతినిధులు మన దేశం నుంచి 28 సినిమాల్ని సెలెక్ట్ చేస్తే అందులో డియర్ కామ్రేడ్ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మన పరిశ్రమ నుంచి ఈ సినిమా స్థానం సంపాదించడం విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులలోను ఆనందం నింపుతోంది. ఫ్లాప్, యావరేజ్ వంటి డివైడ్ టాక్ తో ప్రేక్షకులకు చేరలేకపోయిన ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి సెలెక్ట్ అయిందంటే నిజంగా సంతోషించాల్సిన విషయమే. అయితే ఆ జాబితాలో 2019 బెస్ట్ హిట్ సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి.

2019 బ్లాక్ బస్టర్ సినిమాలు అంధాధున్ - యూరి- బదాయి హో- గల్లీ బోయ్ రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఇతర భాషల నుంచి కూడా చాలా సినిమా నామినేషన్ కేటగిరీలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే తెలుగు సినీపరిశ్రమ నుంచి బరిలో నిలిచింది విజయ్ సినిమా డియర్ కామ్రేడ్ మాత్రమేనన్నది సర్ ప్రైజ్. రౌడీ ఫ్యాన్స్ కి ఇది ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్కార్ అవార్డుల్ని ప్రకటిస్తుంటారు. 2020 ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ లలో మన దేశం తరపున ఏ సినిమా పురస్కారం దక్కించుకుంటుంది అన్నది చూడాల్సిందే. మొత్తానికి దేవరకొండ ముంబై వెళ్లి కరణ్ జోహార్ ని కలిసినప్పటి నుండి అన్నీ కొత్త విషయాలే తెలుస్తున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: