నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ సినిమాకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, తొలిచిత్రం బాగానే ఆడడంతో హీరోయిన్ గా ఆమెకు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. అయితే ఆ తరువాత వెంటనే వరుణ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ముకుంద సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆపై కొన్నాళ్ళకు బన్నీ సరసన డీజే సినిమా సినిమాలో అవకాశం సంపాదించిన పూజ, ఆ సినిమా యావరేజ్ గా మిగలడంతో ఆమెకు ఆ సినిమా పెద్దగా లాభాన్ని అందించలేదు. ఇక ఏడాది గ్యాప్ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆమె జతకట్టిన సాక్ష్యం కూడా ఫెయిల్ అయి, ఆమెకు తీవ్ర నిరాశను కలిగించింది. 

ఇక అదే ఏడాది జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక కావడం, ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ కావడంతో పూజకు ఇక్కడ మెల్లగా అవకాశాలు రాసాగాయి. ఆ వెంటనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన మహర్షి లో ఛాన్స్ రావడం, అది కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, పూజ టాలీవుడ్ బడా హీరోయిన్స్ లో ఒకరుగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో కలిసి జాన్, అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంఠపురములో, అలానే అఖిల్ సరసన ఒక సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇటీవల వరుణ్ తేజ్ తో కలిసి రెండవ సారి హీరోయిన్ గా జతకట్టిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం దూసుకుతుండడంతో, పూజ హెగ్డే కు గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడింది. 

అంతేకాక గద్దలకొండ గణేష్ సినిమాలో, ఒకప్పటి దేవత సినిమాలోని వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ని రీమిక్స్ చేయడం, అలానే ఆ సాంగ్ లో పూజని చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువమంది, ఆమె అచ్చం శ్రీదేవి గారిని పోలి ఉందని ప్రశంశలు కురిపించడం జరుగుతోంది. ఇక నేడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు కూడా తనకు ఆ సాంగ్ లో పూజని చూస్తే శ్రీదేవి గారే గుర్తుకువచ్చారని చెప్పడంతో పూజకు ఒక్కసారిగా మరింత ఇమేజ్ వచ్చింది. మరి ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలతో రాబోయే రోజుల్లో పూజ కనుక మంచి సక్సెస్ లు అందుకుంటే, శ్రీదేవి గారి వలే ఆమె కూడా మంచి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: