ఈరోజు జరగబోతున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ మూవీ భారీ ప్రమోషన్ కు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో జరగబోతున్న ఈ ఈవెంట్ కు అత్యంత భారీ ఏర్పాట్లు చేసారు. వేల సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొనే ఈ ఈవెంట్ లో కొన్ని ఊహించని ట్విస్ట్ లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడ అతిధిగా రాబోతున్న ఈ ఈవెంట్ కు అమితాబ్ నయనతారలు మాత్రం రావడం లేదు అన్న సమాచారం ఇప్పటికే ‘సైరా’ నిర్మాతలకు చేరినట్లు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించక పోవడంతో తాను ఈ ఈవెంట్ కు రాలేకపోతున్నానని అయితే ముంబాయ్ లో జరిగే ఈ మూవీ ఈవెంట్ కు తాను తప్పక వస్తానని అమెతాబ్ స్వయంగా చిరంజీవికి చెప్పినట్లు టాక్. 

ఇప్పటికే నయనతార ‘సైరా’ కు సంబంధించి చెన్నై ఈవెంట్ కు వస్తానని హైదరాబాద్ ఈవెంట్ కు రాలేనని సున్నితంగా చరణ్ కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఇద్దరు కీలక నటులు లేకుండానే ఈ ఈవెంట్ జరగబోతోంది అనుకోవాలి. 

మెగా కాంపౌండ్ తో అతి సన్నిహితంగా ఉంటున్న రాజమౌళి కొరటాల వినాయక్ రాఘవేంద్రరావు లతో పాటు మరికొంత మంది ప్రముఖ దర్శకులు ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈ కార్యక్రమానికి కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడ వ్యక్తిగతంగా చరణ్ ఆహ్వానించినా వారు వచ్చే విషయంలో ఇంకా క్లారిటీ లేదు అని అంటున్నారు. పైకి ఉయ్యాలవాడ కుటుంబీకులు చేస్తున్న నిరసనను పట్టించుకోనట్లు మెగా కాంపౌండ్ కనిపిస్తున్నా ఈ సున్నిత సమస్య ఎలాంటి అనుకోని టర్న్ తీసుకుంటుంది అన్న టెన్షన్ తో పాటు అంతర్మధనంలో చిరంజీవి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: