ఒకవైపు ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు తమకు ‘సైరా’ లాభాలలో 50 కోట్ల షేర్ రావాలి అంటూ మీడియా చుట్టూ పోలీసు స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఇదే కుటుంబానికి చెందిన కొందరు నిన్న చిరంజీవిని కలిసి తమ ఊరులో ఏర్పాటు చేయబోతున్న ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని అతిధిగా పిలవడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అంతేకాదు ఆ ఫంక్షన్ లో తమ కుటుంబానికి చెందిన అందరూ కలిసి చిరంజీవిని సత్కరించ బోతున్నట్లు ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు మీడియాకు ఒక ప్రకటన ఇచ్చారు. దీనితో ఉయ్యాలవాడ కుటుంబం రెండు ముక్కలుగా విడి పోయినట్లు సపష్టంగా అందరికీ అర్ధం అవుతోంది. 

అంతేకాదు తాము ఎప్పుడు చిరంజీవిని డబ్బు అడగలేదనీ అదేవిధంగా చిరంజీవి తీసిన ‘సైరా’ వలన తమకు ఎటువంటి నష్టాలు జరగలేదనీ ఇది అంతా కొందరు వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు మరో ట్విస్ట్ ఇచ్చారు. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి నలుగురు భార్యలు అని చెపుతారు. దీనితో ఆ కుటుంబ సభ్యుల సంఖ్య వందలలో ఉంటుంది. దీనికితోడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసలు వారసులు ఎవరు అన్నది పోల్చుకోవడం న్యాయస్థానాలకు కూడ కష్టమైన విషయం.
 
ఇలాంటి ఈ పరిస్థితులలో ఉయ్యాలవాడ కుటుంబంలో వచ్చిన విభేదాలతో మెగా కాంపౌండ్ చాల సులువుగా ఈ వివాదాల నుంచి బయటపడే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చిరంజీవిని కార్నర్ చేయాలని కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఉయ్యాలవాడ కుటుంబ రాజకీయాలు ప్రస్తుతం మీడియాకు హాట్ న్యూస్ గా మారుతున్నాయి. దీనితో తెలివిగా చిరంజీవి వ్యవహరిస్తూ ‘సైరా’ కు ఎటువంటి సమస్యలు రానీయకుండా చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: