మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుదీప్,  తమిళ నటుడు విజయ్ సేతుపతి, భోజ్ పురి నటుడు రవి కిషన్ సహా, పలువురు ఇతర టాలీవుడ్ నటులు నటించిన ఈ సినిమా టీజర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి విపరీతమైన వ్యూస్ తో పాటు సినిమాపై మంచి హైప్ కూడా తీసుకువచ్చాయి. పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 

తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్  హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరుగనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈనెల 18న జరుగవలసిన ఈ ఫంక్షన్ ని వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఇవాళ్టి వాయిదా వేశారు. ఇక నేటి ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ ఎస్ రాజమౌళి, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వాస్తవానికి టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కావలసి ఉండగా, అప్పటికే ఆయనకు వేరొక కార్యాక్రమం ఉండడం వలన ఆయన రాలేకపోతున్నట్లు తెలిపారు. 

ఇకపోతే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి అమితాబ్ ని అలానే మోలీవుడ్ నుండి మోహన్ లాల్ ని సర్ప్రైజింగ్ గెస్టులుగా ఆహ్వానించారట. అయితే మోహన్ లాల్ కొన్ని అనివార్య కారణాల వల్ల  రాలేకపోతే, అమితాబ్ అనారోగ్య కారణాల రీత్యా రాలేనని చెప్పారట.  అలానే వారితో పాటు హీరోయిన్ నయనతార కూడా నేటి ఫంక్షన్ కు హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇక సైరా సినిమా యూనిట్ నేడు బెంగళూరు, చెన్నై, కొచ్చి లలో కూడా కొన్ని సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. వీటికైనా అమితాబ్ మరియు నయన్ ను తీసుకురావాలని భావించినప్పటికీ అది కుదరలేదట. ఈ విధంగా ప్రమోషన్ విషయంలో అమితాబ్, నయనతార సైరాకు పెద్ద షాక్ ఇస్తున్నట్లు సమాచారం......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: