తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అంచెలంచెలు గా ఎదిగి,తన డాన్స్,పెర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ అనిపించుకున్న స్టార్ యాక్టర్ చిరంజీవి.ఈ హీరో నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులకు సంక్రాంతి పండగ వచ్చినట్లే.థియేటర్లన్నీ కళకళలాడిపోతాయి.ఒకప్పుడైతే టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల ఎదుట తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాచేవారు.ఆయన సినిమా ముందు వేరే సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆలోచించేవారట నిర్మాతలు.ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం ప్రమోషన్ల తో బిజీగా గడుపుతున్నారు.సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం,తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.



ఇక సినిమా కోసం వెంకటేష్ లాంటి పెద్ద హీరోనే తన‘వెంకీమామ’చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు.అంతేకాదు మెగాస్టార్ తో పోటీ ఎందుకని చాలామంది మార్కెట్ ఉన్న హీరోలు కూడా భయపడి తమ చిత్రాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.అయితే ఈ యాక్షన్ హీరో మాత్రం చిరు సినిమా అంటే అస్సలు భయపడట్లేదు.ఆ యాక్షన్ హీరో మరెవరో కాదు గోపీచంద్.అవును గోపీచంద్ నటించిన తాజా చిత్రం‘చాణక్య’తిరు డైరెక్షన్లో,అనిల్ సుంకర 35 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఇప్పుడు ఈ 35 కోట్ల సినిమా 300 కోట్ల సినిమాతో పోటీకి సై అంటూ రావడానికి సిద్దపడుతుందట.అప్పట్లో  గోపీచంద్ కు మంచి మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు తిప్పికొడితే 15 కోట్ల మార్కెట్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఓ పాన్ ఇండియా చిత్రానికి అందులోనూ మెగాస్టార్ చిత్రానికి పోటీగా దిగితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు.మరి గోపీచంద్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి,ఇక అక్టోబర్ 5 న ఈ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు.ఇక చివరి వరకు వేచిచూడాలి ఏం జరుగుతుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: