ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఆ సినిమాకు కొత్త దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో మంచి గ్లామర్ తో పాటు పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ కూడా ఉండడంతో, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, పాయల్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇక ఆ సినిమా సక్సెస్ తో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు కూడా బాగానే అవకాశాలు రావడం జరిగింది. 

ప్రస్తుతం ఆమె వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, గత ఏడాది రిలీజ్ అయిన ఆమె తొలి సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో అలరించే విధంగా నటనను ప్రదర్శించినందకు గాను, మొన్న పాయల్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గత ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఉత్తమ నటుడిగా భరత్ అనే నేను సినిమాలో నటనకు గాను సూపర్ స్టార్ మహేష్ కు అవార్డు రాగా, భాగమతి సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన అనుష్కకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. అయితే ఆర్ఎక్స్ 100 కి గాను పాయల్ బెస్ట్ డెబ్యూ (ఫీమేల్) కేటగిరీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకుంది. 

అయితే తనకు ఈ అవార్డు రావడం పట్ల సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది పాయల్. తన కల నిజమైందని పేర్కొంటూ ఆనంద భాష్పాలు కార్చింది. ఈ మేరకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో దిగిన పిక్ షేర్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అలానే అవార్డు దక్కించుకున్న సమయంలో వేదికపై ఎమోషనల్ గా ఫీల్ అయింది పాయల్. ఆ పిక్ కూడా షేర్ చేస్తూ ఈ పిక్‌ని పేమిస్తున్నా, ఎప్పటికీ మరచిపోలేను అని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాయల్‌కి పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. మొత్తానికి తొలిసారి తనకు ఈ అవార్డు దక్కడంపై పాయల్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: