సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ వచ్చారు. ఒక సినిమా కంప్లీట్ అవగానే మరో సినిమాతో రెడి అయిపోయేవారు. అంతేకాదు గ్యాప్ లేకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు. గట్టిగా సంవత్సరం పాటు గ్యాప్ వచ్చిన సందర్భం కనపడలేదు. అయితే ప్రస్తుతం మహేష్ చేస్తున్న సినిమా తర్వాత ఏంటి అన్న క్లారిటి లేదని తాజా సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ వర్క్ ట్రెండ్ కారణంగా సరిలేరు నీకెవ్వరూ సినిమా చకచకా ఫినిష్ అయిపోతోంది. ఎంత ఆలస్యం అవుతుంది అనుకున్నా, డిసెంబర్ నాటికి హీరో మహేష్ బాబు ఫ్రీ అయిపోతారు. మరి తరువాత సినిమా వెంటనే ప్రారంభమవుతుందా? అంటే ఏమో అన్న సమాధానమే వినిపిస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా వంశీ పైడిపల్లి తెరకెక్కించబోయోది మాత్రమే. అయితే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడే ప్రారంభమైందని ఇన్‌సైడ్ టాక్. అయితే ఈ స్క్రిప్ట్ కంప్లీట్ అవడానికి కనీసం ఆరునెలలు టైమ్ తీసుకుంటారని, వాస్తవం అయితే వంశీ స్క్రిప్ట్ తయారీకి అంతకన్నా ఎక్కువ టైమ్ నే తీసుకుంటారని కూడా టాక్. అందువల్ల ఎలాలేదన్నా మే నెల వస్తుందని అంటున్నారు.

మహేష్ బాబు తరువాత సినిమా మళ్లీ పండగ టార్గెట్ గా 2020 మేలోనే ప్రారంభమవుతుందని వినిపిస్తోంది. అయితే వంశీ పైడిపల్లి సినిమా తరువాత రాజమౌళి తో మహేష్ సినిమా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్  ఎప్పుడో  ఫిక్స్ అయింది కూడా. అయితే రాజమౌళి మే నుంచి 2021 ప్రారంభం వరకు స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ మహేష్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమోనన్న మరో మాట ఇప్పుడు వినిపిస్తోంది.   

నిజానికి అనిల్ రావిపూడి లాంటి సూపర్ ఫాస్ట్ డైరక్టర్ ఎవరైనా దొరికితే, ఈ డిసెంబర్ నుంచి వచ్చే మే లోగా మహేష్ ఓ సినిమా చేసి విడుదల చేయవచ్చు. కానీ అలాంటి డైరక్టర్, అలాంటి స్క్రిప్ట్ అంటే ఒక్క పూరి జగన్నాధ్ తప్ప ఇంకో డైరెక్టర్ ఎవరు అంత స్పీడ్ గా సినిమా తీసి రిలీజ్ చేయలేరు. మరి పూరి-మహేష్ ప్రాజెక్ట్ కమిటవుతారా లేదా అన్నది చూడాలి. ఇక ఇప్పటికే పూరి-మహేష్ కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మాన్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక ఒకే అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: