యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. తనకు లైఫ్ అండ్ లిఫ్ట్ ఇచ్చిన పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమాను అతి తక్కువ వ్యయంలో పూర్తిచేసి, అదే అమౌంట్ కు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు విక్రయించేసారు. నాన్ థియేటర్ రైట్స్ లాభాలుగా వుంచుకున్నారు విజయ్. ఈ సినిమా మీద ఇప్పటికే ఇండస్ట్రీ తో పాటు విజయ్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లోను మాంచి క్రేజ్ నెలకొంది.

ఇక ఈ సినిమాకు విడుదల డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా తాజా సమాచారం. అక్టోబర్ 18న 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను విడుదల చేయాలని విజయ్ అండ్ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ డేట్  లో ప్రస్తుతానికి అయితే అంతగా సినిమాలు లేవు. 24 నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ కు వున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రాబట్టడానికి  అక్టోబర్ 18 డేట్ బాగానే వుంటుందని అలా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇక ఇటీవలే టీజర్, ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్, ఫస్ట్ సాంగ్ తో సినిమా జోనర్ ఎలా వుండబోతోందో సాంపుల్ గా చూపించారు. ఈ తరహా జోనర్ లు మాత్రం కొత్తగా వుంటున్నాయి కనుక ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇక ఈ సినిమా గనక హిట్టైతే నిర్మాతగా కూడా సక్సస్ అవడం ఖాయం. అంతేకాదు తన సొంత బ్యానర్ లోనే హీరోగా విజయ్ సినిమాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళి అందరిని ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: