మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసిం హా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ముగ్గురు కలిసి ఈ ఈవెంట్ లో కనిపించడం విశేషం. ఈవెంట్ లో భాగంగా సైరాకు మాటలు రాసిన సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ హైదరాబాద్ లో సముద్రం లేదని ఎవరన్న్నారు.. మెగాస్టార్ ఒక్క పిలుపుతో వసంతాలు కాదు.. సముద్రాలు వస్తాయని అన్నారు.


మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి సాయి మాధవ్ బుర్రా అలా అనడం విశేషం. మా అమ్మమ్మకు సినిమాలంటే ఇష్టం ఎప్పటికైనా చిరంజీవి సినిమాకు మాటలు రాయమని అనేది. ఖైది నంబర్ 150తో ఆ అవకాశం వచ్చింది. ఆ సినిమాలో వేమా రెడ్డితో కలిసి డైలాగ్స్ రాశాను. పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉందనే డైలాగ్ చిరంజీవి మాత్రమే చెప్పాలని రాశాను. 


ఇక సైరా నరసిం హా రెడ్డి సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం వచ్చిందని.. ఇది ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు సాయి మాధవ్ బుర్ర. రాం చరణ్ ఓ మంచి నిర్మాత. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి లాంటి ఫ్రెండ్ దొరికాడని అన్నారు. ఇక ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వారందరికి ధన్యవాదాలు అన్నారు సాయి మాధవ్.


బుర్రా సాయి మాధవ్ చెప్పాడని కాదు కాని నిజంగానే హైదరాబాద్ లో సముద్రం వచ్చేసిందా అన్నంతగా మెగా ఫ్యాన్స్ వచ్చారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సైరా నరసిం హా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెండు రాష్ట్రాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా వేడుక ప్రత్యక్షంగా చూడాలని వచ్చారు. స్టేడియంలోనే కాదు గేటు బయట కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది.
   


మరింత సమాచారం తెలుసుకోండి: