మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఈవెంట్ కి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారధులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు హీరోయిన్లు నయనతార, తమన్నా.. ప్రత్యేక పాత్ర చేసిన అనుష్కతో సహా ఎవరూ హాజరు కాలేదు.

 


చాలా గ్రాండ్ గా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఫంక్షన్ కు హీరోయిన్లు లేని లోటు స్పష్టంగా తెలిసింది. జులాయి సినిమాలో ‘ఇద్దరూ నిక్కరూ-షర్టేనా.. ఓ గౌను కూడా ఉంటే కలర్ ఫుల్ గా ఉంటుంది’ అని పిల్లల్ని ఉదహరిస్తూ అల్లు అర్జున్ అంటాడు. ఈ ఫంక్షన్ కు ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. సినిమా, ఈవెంట్.. చిన్నదైనా.. పెద్దదైనా అక్కడ హీరోయిన్లు కూడా ఉంటే ఆ సందడి వేరు. ఓ నాలుగు ముక్కలు మాట్లాడితే అభిమానుల కేరింతలతో ఫంక్షన్ లో ఉత్సాహం వస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, చరణ్.. ఇలా మెగా ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఫంక్షన్ తెలుగు రాష్ట్రంలో జరిగింది కాబట్టి హీరోయిన్ల లోటు ఉండకపోయినా.. వాళ్లు పాల్గొనటమే ఫంక్షన్ కు అసలైన కలరింగ్. బాలీవుడ్ లో ట్రైలర్ లాంఛ్ కు తమన్నా రావడంతో సినిమా కలర్ వచ్చింది. ఇక్కడ కూడా చరణ్ కాస్త దృష్టి పెట్టి తమన్నాను తీసుకొచ్చున్నా బాగుండేది.

 


సైరా ఫంక్షన్ మొత్తం ఉల్లాసంగా జరిగింది. వరుణుడు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాడు. దీంతో ఫంక్షన్ త్వరగానే ముగించారు. రాజమౌళి, పవన్, చిరంజీవి వల్ల ఫంక్షన్ ఆమాత్రం జరిగింది కానీ.. వారు కూడా తక్కువ మాట్లాడి ఉంటే ఇంకా త్వరగానే ముగిసేది. ఈ ఈవెంట్ తో సైరాపై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: