త్రీ మూవీతో సినిమాలలోకి ఎంటర్ అయిన ఆల్బం సింగర్ శృతి హస్సన్.. లోకనాయకుడు విలక్షణ నటుడు కుమార్తెగా సినిమాలలోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ తన మాటలతో నటనతో సక్సెస్ తో దూసుకుపోతూ వచ్చింది. ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.


తమిళ్ ,తెలుగు, హిందీ సినిమాలలో నటించిన ఈమెకు ఎక్కువ సినిమాలు లేవని చెప్పాలి. సింగర్ గా ఎన్నో ఆల్బమ్స్ చేసింది శృతిహాసన్. తెలుగు లో పవన్ కళ్యాణ్ , సూర్య , సిద్దార్థ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. పవన్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. సూర్యతో నటించిన 7  సెన్స్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇక సిద్దార్థ్ తో కలిసి నటించిన అనగనగ ఓ ధీరుడు హిట్ అవ్వకపోయిన కూడా ఆమె పాత్రకు గుర్తింపు తీసుకొచ్చింది. అతగాడితో ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించి పేరు సంపాదించింది. ఇది ఇలా ఉండగా ఆమె గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పి బాయ్ ఫ్రెండ్ తో షికారు చేసింది. ఏమైందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.


విషయానికొస్తే.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తుంది. ఏ ప్రదేశానికి వెళ్లినా కూడా ఫోటోలలో ఆ అందాలను బందించి తన సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వస్తున్నా విషయం తెలిసిందే, తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ సినిమా అవకాశాలకోసం చేస్తుందేమో అని అందరిచేత కామెంట్లు వేయించుకుంటుంది. ఇక ఏ హీరో సినిమాలో నటించి మళ్ళీ ఫామ్లోకి వస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: