మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న దృశ్యం నిన్న ‘సైరా’ ఈవెంట్ లో కనపడటంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. చిరంజీవి పవన్ లను ఒకే వేదిక పై చూడాలి అన్నది మెగా అభిమానుల చిరకాల కోరిక. 

ఆ దృశ్యం నిన్న ‘సైరా’ ఈవెంట్ లో కనిపించడంతో మెగా అభిమానులకే కాకుండా మీడియా కెమెరాలకు కూడ హాట్ టాపిక్ గా మారింది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎల్ బి స్టేడియం పూర్తిగా నిండిపోవడంతో మెగా సముద్రంగా మారిపోయింది. 

దీనికితోడు పవన్ ఈ ఈవెంట్ లో చాల ఉద్వేగంగా ఉపన్యాసం చేసిన సందర్భంలో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక వీరాభిమాని దూసుకు వచ్చి పవన్ కాళ్ళ పై పడ్డాడు. ఈ అనుకోని సంఘటనకు పవన్ షాక్ గురై వెంటనే తేరుకున్నాడు. ఈ సంఘటనతో పవన్ కోపంగా తన బౌన్సర్ల వైపు చూస్తూ ‘ఆప్ లోగ్ ఛలే జాయే.. అరే భాయ్.. ఆప్ లోగ్ పీచే జాయే ప్లీజ్. ఛలే ఆప్’ అన్నాడు. అంతేకాదు ఆ వీరాభిమానిని పవన్ కౌగలించుకుని తన కృతజ్ఞతను తెలియచేసాడు.

ఈ సంఘటన జరిగింది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అయినా ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన మెగా అభిమానుల కేకలు ఈలలతో ఎల్ బి స్టేడియం హోరెత్తి పోయింది. ఈ దృశ్యాన్ని పవన్ పక్కనే ఉండి చూసిన చిరంజీవి తన తమ్ముడుకి మెగా అభిమానులలో ఉన్న మ్యానియాను చూసి ముసిముసి నవ్వులు కరిపించాడు. వాస్తవానికి ఇలాంటి వీరాభిమానులు ఎందరో పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. అయితే అలాంటి అభిమానాన్ని పవన్ ఓట్ల రూపంలో మలుచుకోలేక పోవడం ఒక విధంగా దురదృష్టకరం. అయితే రానున్న రోజులలో పవన్ మరింత మనసు పెడితే ఈ అభిమానం ఓట్లుగా మారే  అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: