మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన కుర్ర హీరోలు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ వేడుకకు హాజరు అయ్యి సినిమా గురించి మరియు చిరంజీవి గురించి ప్రసంగిస్తూ మెగా అభిమానులను అలరించారు. ముఖ్యంగా ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అది భారతదేశం గురించి చేసిన ప్రసంగం గ్యాలరీ లో ఉన్న అభిమానులను ఎంతగానో అలరించింది.


కాగా ఈ సినిమా వేడుకకు అల్లు అర్జున్ రాకపోవడంతో అనేక భారీ విమర్శలు వస్తున్నాయి. మరియు అదే విధంగా చాలా అనుమానాలకు తెరలేపింది. ఉన్న కొద్ది మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరమవుతున్నారు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కనీసం ఈ ప్రీ రిలీజ్ వేడుక గురించి సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ స్పందించకపోవడం పై మెగా అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు. సైరా ప్రమోషన్స్ లో మెగా హీరోలందరూ మెగాస్టార్ పోటోలను టీజర్స్ ట్రైలర్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటే బన్నీ మాత్రం పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.


గతంలోనే పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ బన్నీ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అదికూడా రామ్చరణ్ నిర్మించిన సినిమాకి అల్లు అర్జున్ రాకపోవటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక అద్భుతంగా జరిగింది . మెగా అభిమానులకు సినిమాపై అంచనాలు పెంచేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: