చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా’. స్వాతంత్ర పోరాట నేపథ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి చేయడం జరిగింది. అప్పట్లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడిగా తెలుగు వ్యక్తుల్లో ప్రథముడిగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ నుండి చాలా మంది ప్రముఖులు రాగా ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ మరియు దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.


ఈ సందర్భంగా సైరా సినిమా ఉద్దేశించి సోషల్ మీడియాలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీడియో విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవి కి మరియు సినిమా నిర్మాత రామ్ చరణ్ కి అలాగే సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. రిలీజ్ అయిన వీడియో లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..కొన్నేళ్ల క్రితం రాంచరణ్ నాకో మాట చెప్పాడు. నాన్న గారితో అద్భుతమైన చిత్రం తీయాలి. ఆ చిత్రం మనమంతా గర్వపడేలా ఉండాలి అని అన్నాడు. నేను సైరా టీజర్ చూడగానే రాంచరణ్ చెప్పిన మాటే గుర్తుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి అదరగొట్టారు.


ఎనర్జీతో మెగాస్టార్ ని కొట్టేవాడు పుట్టలేదు. లవ్యూ అన్నయ్యా.. ఒక అభిమానిగా సైరా చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెబుతున్నా అని పూరి తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా హీరోయిన్ గా నయనతార నటించింది. అలాగే తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో సైరా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: