టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సూపర్ హిట్ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన ఏ మూవీ హిట్ కాలేదు.  దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రామ్ పొతినేని హీరోగా పెట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీశాడు..ఈ మూవీ అనుకున్నదానికన్నా ఎక్కువే హిట్ అయ్యింది..భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో ‘పైసా వసూల్’ సినిమాలో నటించాడు. ఈ మూవీ నిజంగా పైసా వసూల్ సినిమా కాలేదు..కానీ బాలకృష్ణ కెరీర్ లో ఓ మాస్ మూవీగా మంచి పేరు సంపాదించింది.

ఇటీవల తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..కానీ ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఈలోగా ఏపిలో ఎన్నికలు రావడం..హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య గెలవడం జరిగిపోయింది.  ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ ఒక సినిమా చేయ నున్నాడు. ఇక బోయపాటితో మూవీ పూర్తయిన తర్వాత మరోసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి ఓ కథ సిద్దం చేసినట్లు..బాలయ్యకు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కథ నచ్చడంతో బాలయ్య కూడా ఓకే చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

గతంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. ఆ పాత్రలకి మించి ఈ రోల్ ఉంటుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటు న్నారు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో వచ్చిన మూవీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి..మరి ఈ మూవీ బాలయ్యకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: