మోడల్ గా రాణించిన అమీ జాక్సన్ 2010లో ‘మద్రాసు పట్టణం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో మొదటిసారిగా రాంచరణ్, అల్లు అర్జున్ నటించిన ‘ఎవడు’ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడు’ మూవీలో బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ నటించింది. అమీ జాక్సన్ గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ మూవీలో నటించింది.  కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. మరోసారి శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 మూవీలో నటించింది. 

ఈ మూవీలో అమీ జాక్సన్ ఒక రోబో పాత్రలో నటించడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇదిలా ఉండగా అమీ జాక్సన్ లండల్ లో తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ పనయివోట్ అనే వ్యాపార వేత్తతో అమీజాక్సన్ కోనేళ్ళుగా ప్రేమలో ఉంది. కాగా ఈ ఏడాది ఆరంభంలో తాను గర్భవతిని అని ప్రకటించిన అమీ జాక్సన్ అందరిని ఆశ్చర్యపరిచింది. ట్విస్ట్ ఏంటంటే అప్పటికీ వీరికి పెళ్లి కాలేదు..పెళ్లి కాకుండానే అమీ జాక్సన్ తల్లైంది.  కాగా,  జార్జ్, అమీజాక్సన్ కు ఎంగేజ్ మెంట్ జరిగింది. 

అయితే అమీ జాక్సన్, జార్జ్ కుటుంబ సభ్యుల మద్య స్నేహ సంబంధాలు ఉండటం వల్ల వీరిద్దరూ ప్రేమలో పడటం..ప్రెగ్నెన్సీ రావడం..ఎంగేజ్ మెంట్ సెట్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. తాజాగా అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  హాస్పిటల్ బెడ్ పై తన బేబీతో అమీజాక్సన్ ఉండగా ఆమె ప్రియుడు జార్జ్ అమీ నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ఈ ఫోటోని షేర్ చేసిన అమీజాక్సన్ తాను తల్లి అయిన విషయాన్ని ప్రకటించింది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: