టాలీవుడ్ స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా సినిమా అల వైకుంఠపురములో. బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు రొమాన్స్, కామెడీ, యాక్షన్ కల గలిపి తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ టీజర్, ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, 

పిఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి, అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నామని, దానికి సంబందించిన సాంగ్ రికార్డింగ్ అప్పుడే స్టార్ట్ అయిందని, దాని కోసం మా టీమ్ అందరం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాం అని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో కాసేపటి క్రితం ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. 

కొద్దిరోజులుగా ఈ సినిమా విషయమై ఇప్పటివరకు సరిగ్గా ప్రమోషన్ స్టార్ట్ కాలేదని భావిస్తున్న బన్నీ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ ఒక్కసారిగా మంచి కిక్ ఇచ్చింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్ ని దసరా పండుగ రోజున రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడట. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: