సూపర్ స్టార్ మహేష్ బాబు  టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు' ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన  సెట్‌ లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.  అయితే ఇన్నేళ్ల మహేష్ కెరీర్లో సంక్రాంతి బరిలో దిగింది కేవలం నాలుగు సార్లే.  మొట్టమొదటి జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన 'టక్కరి దొంగ' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది.  ఆ చిత్రం విడుదలైన రెండేళ్లకు 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతి కి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆతరువాత  2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం  మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తరువాత  పూరి తెరకెక్కించిన బిజినెస్ మెన్ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై  హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ఇలా ఇప్పటికి మహేష్ సంక్రాంతి సినిమాలలో  రెండు సూపర్ హిట్లు,  ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఒక యావరేజ్ సినిమాగా నిలిచాయి.  మరి 2020 సంక్రాంతి కి వస్తోన్న సరిలేరు నీకెవ్వరూ మూవీ  మహేష్ కి  ఏ స్థాయి హిట్ ఇస్తోందో  చూడాలి. 

ఇక దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్,  అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో...  'సరిలేరు నీకెవ్వరు'లో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట.   కాగా ఇప్పటికే బండ్ల షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. అవుట్ ఫుట్ చాలాబాగా వచ్చిందని తెలుస్తోంది.  ఇక బండ్ల గణేష్  చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది.  ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్  సినిమాతో మళ్లీ   సినిమాల్లోకి  రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది  బండ్ల గణేషేనట.  ఒకరకంగా   ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా  చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.  ఓ  అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా  పప్పు సుద్దలా..  ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే  రైలు సీక్వెన్స్   సినిమాలోనే  చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట. 

ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.  ఈ చిత్రాన్ని  దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: