తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి  జయలలితగారి  జీవితం ఆధారంగా  బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది.  కాగా  నవంబర్ 6వ తేదీ నుండి రామేజి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న  ఈ బాలీవుడ్ క్వీన్..  బరువు కూడా పెరుగనుంది.    ఈ సినిమా కోసం దాదాపు  పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట.  అయితే ఫస్ట్ షెడ్యూల్ తరువాతే ఆమె బరువు పెరగనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యుక్త వయసులో ఉన్నప్పటి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఆ సన్నివేశాల కోసం కంగనా ఇంకా ఫిట్ గా కనిపించడానికి ప్రస్తుతం  కొత్త డైట్ కూడా ఫాలో అవుతున్నారట.  బాహుబలి రైటర్  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తెరకెక్కుతున్న  ఈ చిత్రం  తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  విడుదలకానుంది. అలాగే  ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు  ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఈ పాత్రలకు నటులను ఇటివలే ఫైనల్ చేసారు. 

 ఎం.జి.రామచంద్రన్  పాత్రలో  అరవింద్‌ స్వామి నటించబోతుండగా.. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు మురళీ శర్మ నటిస్తున్నారు.  అయితే కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలని మొదట అనుకున్నా.. దర్శకుడు చివరికీ మురళీ శర్మ వైపు ఇంట్రస్ట్ చూపించాడు.  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం  కూడా సినిమాలో  హైలెట్ చేస్తూ కథ ఉంటుందట.   కాగా ఈ బయోపిక్ బడ్జెట్  వంద కోట్లు అని తెలుస్తోంది.   ఎలాగూ  కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.  ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా  ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.  కంగనా  రనౌత్ ను  అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు వస్తున్నారు.    హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన  'గ్యారీ ఓల్డ్ మెన్,  'అమ్మ' బయోపిక్  కూడా చెయ్యనున్నారు. జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే  కంగనా  రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి  న్యాయం జరుగుతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: