సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రాబోతున్న  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం పై  గత కొన్నిరోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకులు   వివాదాం చేస్తోన్న సంగతి  తెలిసిందే.  ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలేదని, మోసం చేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకులు  పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.   మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ వాళ్లు ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున రూ.50 కోట్లు అడగడం భావ్యం కాదని, అమాయకులైన వారిని ఎవరో ఉసిగొల్పుతున్నారని అన్నారు.  కానీ ఉయ్యాలవాడ వంశీకులు మాత్రం తాము ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్లు అడగలేదని, వంశీకులు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు చొప్పున ఇవ్వమని అడిగామని అన్నారు.  ఈ వివాదానికి సంబంధించి తాము వేసిన కేసుల‌న్నీ వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.  ఈ పరిణామంతో సినిమాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.  మరి దీనిపట్ల నిర్మాత చరణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి బన్నీ కూడా స్పందించాడు.    కొన్నిరోజుల క్రితం జరిగిన 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు మెగా హీరోలంతా హాజరై అల్లు అర్జున్ రాకపోవడం అభిమానుల నడుమ పెద్ద చర్చకు దారితీసింది.  మెగా కుటుంబానికి, బన్నీకి నడుమ మనస్పర్ధలు ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది.  దానికి తోడు ఇండస్ట్రీ మొత్తం ట్రైలర్ గురించి మాట్లాడినా అల్లు అర్జున్ మాత్రం స్పందిచలేదు.  దీంతో అపోహలు మరింత ఎక్కువయ్యాయి.  వాటన్నిటికీ ఫులుస్టాప్ పెడుతూ తాజాగా బన్నీ రియాక్ట్ అయ్యారు.  'సైరా నరసింహారెడ్డి' చిరంజీవిగారు చేస్తున్న గొప్ప చిత్రమన్న బన్నీ,  కొన్నేళ్ల క్రితం 'మగధీర' సినిమా చూసినప్పుడు అలాంటి చిత్రంలో చిరంజీవిగారిని చూడాలనుకున్నాను.  సైరాతో నా కోరిక తీరింది.  నిర్మాత, నా సోదరుడు రామ్ చరణ్ కు శుభాకాంక్షలు.  ఒక కొడుకు తండ్రికి ఇచ్చే గొప్ప బహుమతి ఇది.  దర్శకుడు సురేందర్ రెడ్డికి నా ప్రత్యేక అభినందనలు.  ఈ చిత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని  అన్నారు.  

 నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: