సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత ఫాస్ట్ గా స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటారో అంతే ఫాస్ట్ గా ఆ స్టార్ ఇమేజ్ ని పోగొట్టుకుంటారు. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ గ్లామర్ తోనే స్టార్ హీరోల సినిమాలతో నటించే అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇక కొంతమంది మాత్రం టాలెంట్ కన్న లక్ బాగా ఫేవర్ చేసి అందం అభినయం అంతంత మాత్రంగా ఉన్నా చక చకా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలానే చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. మొదట రెండు సినిమాలతో తన ఫేట్ మారింది. ఛలోతో పాటు గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తనకు అవకాశాలు వెల్లువలా రావడం మొదలయ్యాయి. 

అలా మహేష్ బాబు పక్కన ఛాన్స్ వచ్చింది. మహేష్ తో సినిమా అని రష్మిక బాగానే సంబరపడిపోతుంది. కానీ 'సరిలేరు నీకెవ్వరు' పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో హీరోని హైలెట్ చేసే సీన్స్ మాత్రమే ఉంటాయి. ఆ విషయం దూకుడు, ఆగడు, మహర్షి..వంటి సినిమాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలలో సాధారణంగా హీరోయిన్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. సో ఈ సినిమాలో రష్మికకి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉంటుందో అన్న సందేహాలు ఇప్పుడు చాలామందిలో ఉన్నాయి.

అసలే మన రష్మిక కి టాలెంట్ తక్కువ లక్ ఎక్కువ. ఈ విషయం తన మొదటి సినిమా నుండి గమనిస్తే తెలుస్తుంది. ఇటువంటి టైంలోనే రష్మిక పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ అయితేనే హైలెట్ అవుతుంది. పైగా రష్మిక గ్లామర్ విషయంలో కూడా పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా వంటి హీరోయిన్స్ తో పోలిస్తే వెనుకంజేనని చెప్పాలి. పైగా డాన్సు కూడా పెద్దగా రాదని ఇప్పటి వరకు తను నటించిన సినిమాలు చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. అందుకేనేమో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ కోసం గ్లామర్ హీరోయిన్లను తీసుకునే ప్రయత్నంలో పడ్డాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పూజా హెగ్డే, తమన్నా ఇందులో స్పెషల్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేయనున్నారు. సో ఇలా చూస్తే ఈ సినిమాలో రష్మిక పూర్తిగా డమ్మీ అయిపోవడం ఖాయం. ఈ సినిమా చేయడం వల్ల రష్మికకు ఏమి లాభం లేదు. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన ఖాతాలో హిట్ ఒకటుంటుంది...అంతే. 



మరింత సమాచారం తెలుసుకోండి: