టాలీవుడ్ లో మెగా వీరాభిమాని, కమెడియన్,స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ గత కొంత కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు తీసిన బండ్ల గణేష్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  ఇటీవల తెలంగాణలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఆయన పోటీలో నిలబడలేదు. అయితే ప్రచారంలో మాత్రం తనదైన స్టైల్లో ఊదరగొట్టాడు. తెలంగాణలో వచ్చేది మహా కూటమి..టీఆర్ఎస్ ని తుంగలో తొక్కేస్తాం అంటూ తెగ రెచ్చిపోయారు. 

అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్ మహాకూటమి రాకుంటే బ్లేడ్ తో తన మెడ కోసుకుంటానని చెప్పారు.  తీరా తెలంగాణలో మహాకూటమి పత్తకు లేకుండా పోయింది..దారుణమైన ఓటమి చవిచూసింది. అంతే కాదు ఆ పార్టీ తరుపున గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పాడు బండ్ల గణేష్. తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా బండ్ల గణేష్ నేడు రిలీజ్ అయిన మెగాస్టార్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’పై తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. తెలుగువాడి సత్తాను మరోసారి సినీ ప్రపంచానికి చాటిచెప్పిన మా సైరా అన్నకు పాదాభివందనం అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ ‌పై కూడా బండ్ల ట్వీట్ చేశారు.

‘మళ్ళీ మీతో ఒక సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అంటూ తన అభ్యర్ధనను తన ట్విట్ ద్వారా తెలిపారు బండ్ల గణేష్.  గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో తీసిన ‘గబ్బర్ సింగ్’ బండ్ల స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్లింది. తాజాగా  ఆయన విజ్ఞప్తికి రామ్‌చరణ్ స్పందించి సినిమాను నిర్మించే అవకాశాన్ని ఇస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: