బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన ఒకప్పటి ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ తర్వాత తెలుగు, మళియాళ భాషల్లో ఐటమ్స్ సాంగ్స్ లో నటించింది.  బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత ఐటమ్ గల్ గానే కొనసాగుతూ వస్తుంది.   జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ సినిమా.  మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు మూవీలో ఈమె కూడా నటించింది.

ఆ మద్య స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. అయితే ఒకప్పుడు ఫోర్న్ ప్రపంచాన్ని ఏలేసిన సన్నీలియోన్ ప్రస్తుతం వాటన్నింటికీ గుడ్ బాయ్ చెప్పి భర్త డెనియల్ వెబర్ ప్రశాంతంగా కాపురం చేసుకుంటుంది. అంతే కాదు ఆ మద్య ఓ పాపను కూడా దత్తత తీసుకుంది.  గత ఏడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు సన్నీ తల్లి అయింది. 

సన్నీలియోన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్రేజీ స్టార్ గా కొనసాగుతున్న సన్నీకి మానవత్వం కూడా ఎక్కువే అంటారు. ఇప్పటికే ఆమె పలు సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.  తాజాగా సమాజసేవకు సన్నీ నడుం బిగించింది. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తనవంతు కృషిని ప్రారంభించింది. క్యాన్సర్ బారిన పడినవారిని కాపాడేందుకు సిద్ధమైంది. దీనికోసం విరాళాలను కూడా సేకరించబోతున్నట్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: