మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తన స్టామినా ఏంటో  మగధీరతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సైరా నర్సింహారెడ్డి నిర్మించి నిర్మాతగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.  ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా లు లు చేయడానికి చాలమంది నిర్మాతలు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి జాబితాలో బండ్ల గణేష్ కూడా చేరారు.


ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ కమెడియన్గాసినిమాల్లో నటించి బడా నిర్మాతల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, మెగా ఫ్యామిలీ కి వీరాభిమాని గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అదే ఊపులో చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడే’ తీశారు. కానీ అనుకోకుండా ఆ చిత్రం భారీ పరజయాన్ని చవిచూసింది. దాంతో బండ్ల ప్రతిష్ట మసకబారింది.


అందుకే ఏ హీరోతో అయితే డిజాస్టర్ ఎదురైందో అదే హీరోతో హిట్ సినిమా తీయాలని బండ్ల డిసైడ్ పైన అంటున్నాడు.  నేరుగా ట్విట్టర్ వేదికగామళ్లీ మీతో ఓ సినిమా తీయాలని ఉంది. ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఉంది. ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు బండ్ల గణేష్.

ఒకవైపు మెగాస్టార్ సైరా సినిమా ప్రమోషన్ లో లో బిజీగా ఉన్నాడు చెర్రీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్. ఆర్.ఆర్ తో బిజీ కానున్నాడు. ఈ సమయంలో బండ్ల గణేష్ అభ్యర్థనను చరణ్ పట్టించుకుంటారో లేదో, ఒకవేళ పట్టించుకుంటే బండ్లకు ఎప్పటికి డేట్స్ ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: