టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగాస్టార్
చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన
పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లే అని చెప్పొచ్చు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి డైరెక్షన్ లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన
అల్లు అర్జున్ తర్వాత నటించిన దేశముదురు, ఆర్య, బన్ని లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను తపవైపు తిప్పుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ అన్నింటా మెగా హీరో ఏంటో చూపించాడు.
ఆ మద్య వక్కంతం వంశి దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరుసూర్య’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్ని ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అలా వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో షూటింగ్ గ్యాప్ ఏమాత్రం వచ్చినా వెంటనే తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హీరోల్లో
అల్లు అర్జున్ ఒకరు. తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ కొడుతూ..అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.
అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు పిల్లలు. తాజాగా స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ చేసుకున్నాడు. ఖరీదైన ఇల్లు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి రీసెంట్గా భూమి పూజ కూడా చేశాడు. అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. గతకొద్ది రోజులుగా ‘అల వైకుంఠపురములో’ షూటింగుతో బిజీగా ఉన్న బన్నీ... షెడ్యూల్ గ్యాప్ దొరకడంతో మంచి రోజు చూసి.. భూమి పూజ చేశాడు.
తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ.. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన పిక్ పోస్ట్ చెయ్యగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.