పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా తన మకాం మొత్తం హైదరాబాద్ నగరం నుండి పూణేకు మార్చటం జరిగింది. దీంతో అప్పుడప్పుడు మాత్రమే... విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన పిల్లలను కలుసుకుంటూ వచ్చేవాళ్లు. అప్పట్లో చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పూణే లో జరిగిన తన కూతురు  పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో ఉంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో పిల్లలు పెద్దలు అవుతున్న తరుణంలో రేణు దేశాయ్... పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత తాజాగా ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


అదేమిటంటే పిల్లలు పెద్ద వయసు కు వస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీ కి పిల్లలను దూరం అవ్వకూడదు అని పూణే నుండి పూర్తిగా హైదరాబాద్ నగరానికి తిరిగి షిఫ్ట్ అవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. అకిరా నందన్, ఆధ్య ఇద్దరూ పిల్లలు... పెద్ద వయసు కు వస్తున్న తరుణంలో వాళ్ల తండ్రి ఫ్యామిలీ నుండి విడతీయకూడదని..తనతో పాటే పూణేలోనే పిల్లలు ఉంటే వాళ్లకి చాలా చిన్న ప్రపంచం మాత్రమే ఉంటుంది..కానీ వాళ్లకి మెగా ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఈ వయసు నుండి ఉంటే వాళ్లకి సపోర్ట్ చాలా ఉంటుంది భవిష్యత్తు లో కూడా అంటూ రేణుదేశాయ్ భావిస్తున్నట్లు సమాచారం.


దీంతో మరికొద్ది రోజుల్లోనే పిల్లలతో సహా పూణే రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి రేణుదేశాయ్ వస్తున్నట్లు తెగ వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా తెలుగు టెలివిజన్ రంగంలో చాలా రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్న రేణుదేశాయ్..ఎక్కువగా పూణే నుండి హైదరాబాదు నగరానికి షూటింగ్ కోసం తరచూ ప్రయాణాలు కూడా ఎక్కువ అవడంతో..ఖర్చు కూడా కావడంతో..ఇటువంటి బాధలు లేకుండా కూడా ఉంటుందనే భావంతో రేణు దేశాయ్ హైదరాబాదుకి వచ్చేస్తున్నారు అని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: