డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంది. అందుకు కారణం విజయ్ దేవరకొండ లాంటి ఒక సాధారణమైన, ఏమాత్రం ఇమేజ్ లేని టైంలోనే హీరోగా పెట్టి పెళ్ళి చూపులు వంటి ఒక విభిన్నమైన కథ తో సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న తరుణ్ భాస్కర్ కి సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత అండ దండలు దొరకడంతో ఇండాస్ట్రీ మొత్తం అతని వైపే చూసింది. అందుకే సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలని చేయడానికి కమిటయ్యాడు. అంతేకాదు ఫలక్‌నుమా దాస్ అనే సినిమాలోను నటుడిగా తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి చూపించాడు. అందుకే విజయ్ దేవరకొండ తరుణ్ ని హీరోగా చేయడానికి ముందుకు వచ్చాడు. 

విజయ్ తండ్రి నిర్మాతగా మారి, తన కొడుకుల పేర్లు నిర్మాతలుగా పెట్టి తీసిన మొదటి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు షమ్మీర్ సుల్తాన్  దర్శకత్వం వహించాడు. ఈనెల 18న విడుదలవుతుంది ఈ సినిమా.. అంటూ ఆ మధ్య వార్తలు బాగా బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు చిత్ర బృందం. 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నవంబర్ 1న విడుదల చేస్తామని యూనిట్ పక్కా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎలాంటి కామెడీ పండిందనేది ఈ సినిమా కాన్సెప్ట్. పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మారి, ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేసిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నారన్న సంగతి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. ఇక ఈ సినిమా రిలీజ్ చేస్తున్న డేట్ కే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారని తాజా సమాచారం. అయితే దర్శకుడిగా సత్తా చాటుకున్న తరుణ్ హీరోగా సక్సస్ అవుతాడా అన్న సందేహాలు కొందరిలో ఉన్న మాట వాస్తవం. అయితే..దర్శకుడిగా కంటే నటుడిగా టెన్షన్స్, రిస్క్ తక్కువనే తరుణ్ ఇలా టర్న్ తీసుకున్నాడని కొంతమంది కామెంట్ చేస్తున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: