మిల్కీ బ్యూటీ తమన్నా రాం చరణ్ తో రచ్చ, పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు, బన్ని తో బద్రినాథ్, సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ మెగా హీరోల సరసన ఛాన్స్ వస్తుందన్నది కూడా ఊహించిందే. కారణం అప్పుడు తమన్నా కెరీర్ పీక్స్ లో ఉంది కాబట్టి. అయితే సైరాలో ఛాన్స్ మాత్రం లక్ అని చెప్పాలి. బాహుబలిలో చూసిన తమన్నా ని మళ్ళీ సైరాలో చూస్తారా అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. అయితే ఊహించని ఈ అవకాశమే చిరు తో స్క్రీన్ షేర్ చేసుకునేలా చేసింది. అంతేకాదు తన కెరీర్ బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నానని తెగ సంబర పడుతోంది.సైరా నరసింహారెడ్డిలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయని ఉబ్బి తబ్బిబ్బవుతోంది. 

అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన సైరా సక్సెస్ వేదికపై మిల్కీ బ్యూటీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు, నా కెరీర్ బెస్ట్ రోల్ లక్ష్మీ ఇచ్చినందుకు థాంక్స్. ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో సినిమాని చూసుకున్నా. నన్ను అంతగా చూపినందుకు థాంక్స్ అంటు తమన్నా ఆనందంతో గాల్లో తేలిపోయింది. చిరు సర్ డ్రీమ్ ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా నటన బావుంది అని చిరు సర్ అంటే అది చాలు అనుకున్నాను. అలాంటిది లక్ష్మీ పాత్రలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 'లక్ష్మీ నరసింహారెడ్డి' అని పిలుస్తున్నారు. ఒక నటిగా అదే నాకు బిగ్ కాంప్లిమెంట్. నా కెరీర్ బెస్ట్ కాంప్లిమెంట్. అంటూ ఆనందం వ్యక్తం చేసింది తమన్నా.

చిరంజీవి.. మెగాస్టార్ ఎందుకు అయ్యారు? అన్నదానికి తమన్నా.. చిరంజీవి గారు చాలా సింపుల్ గా ఉంటారు. ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. అందుకే మెగాస్టార్ అయ్యారు అంటు పొగడతలతో ముంచేసింది.  ఇక ఈ సినిమాకి సుశ్మిత కాస్ట్యూమ్స్ అద్భుతంగా డిజైన్ చేశారని... తనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని... అవకాశం వస్తే తనతో మళ్లీ కలిసి పని చేస్తానని తమన్నా చెప్పింది.  ఇక తమన్నా పెట్రోమాక్స్ అనే బాలీవుడ్ సినిమాతో పాటు కంగన రనౌత్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ తదితర సినిమాలతో 2020 లో ప్రేక్షకులను అలరించబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: