రీసెంట్ గా అందాల తార కాజల్ అగర్వాల్ 12 సంవత్సరాల  సినీ  ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. కాజల్  ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ కు మంచి పోటీ ఇస్తుంది.   అందాల ప్రదర్శనకు కూడా వెనకకు రావడం లేదు. కాజల్ తన కెరియర్ లో సూపర్   హిట్స్ ను చూసింది,అట్టర్ ఫ్లాప్స్ ను  కూడా చూసింది. తన అభినయం తో మరియు అందంతో ఎంతో మంది అభిమానులను  సంపదించుకుంది.


కాజల్ అగర్వాల్  దర్శకుడు తేజ  హీరో కళ్యాణ్ రామ్ కాంబోలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం  సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్  అవడంతో ఆమెకు మంచి బ్రేక్ దొరికింది. ఆ తరువాత  కాజల్ కు వరుసగా  సినిమా ఆఫర్స్ వచ్చాయి..కాజల్ కెరియర్ లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్  ,ఖైదీ నెం 150 ,టెంపర్,నేనే రాజు నేనే మంత్రి, సినిమాలు మంచి విజయం సాధించాయి.


కాజల్   గురువారం  విశాఖ పట్నం లో ఒక మొబైల్ షోరూం ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.  తనకు విశాఖపట్నం అంటే చాలా ఇష్టమని ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకి తనకు నచ్చిన వ్యక్తి   దొరికితే తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం   మంచు విష్ణు తో కలిసి ఒక  హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నానని . అలాగే భారతీయుడు 2, క్వీన్, కాల్ సెంటర్ ముంబాయి సాగా, సినిమాలతో పాటు హిందీ మరియు తమిళ  వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నానని చెప్పింది..


మరింత సమాచారం తెలుసుకోండి: