2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం గీత గోవిందం. ఈ సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. రష్మిక అయితే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. దర్శకుడు పరశురామ్ తో వర్క్ చేయాలని స్టార్స్ వెంటపడ్డారు. గీతాగోవిందం వచ్చి 15నెలలు దాటినా... పరశురామ్ ఇంతవరకు మరోసినిమాను అనౌన్స్ చేయలేదు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు స్టార్స్ ఎందుకు హ్యాండ్ ఇచ్చారు. 


గీత గోవిందం 16కోట్లు బిజినెస్ చేస్తే... 70కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. గీతాగోవిందం ఘన విజయంతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క స్టార్ కూడా పరశురామ్ ను ఒకే చేయలేదు. శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ కు ముందే.. గీతా ఆర్ట్స్ లో మరో సినిమాకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గీత గోవిదం చేశాడు. రిలీజ్ తర్వాత పరశురామ్ తో మరో మూవీ చేసినట్టు అల్లు అరవింద్ అనౌన్స్ చేశాడు. బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నాడని.. కాదు.. కాదు.. గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య నటించే మూవీకి పరశురామే దర్శకుడంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇందులో ఒక్కటీ వర్కవుట్ కాలేదు. 


పరశురామ్ డైరెక్ట్ చేసే హీరోల జాబితాలో పెద్ద హీరోలు ఒక్కొక్కరుగా చేరాడు. ముందుగా బన్నీపేరు వినిపించినా.. సెట్ కాలేదు. ఆ తర్వాత మహేశ్, పరశురామ్ కాంబినేషన్ సెట్ అయినట్టేనని ప్రచారం జరిగింది. దర్శకుడు ఆల్ రెడీ కథ రాసుకునే పని మొదలుపెట్టాడు. కథ మహేశ్ కు నచ్చలేదో.. ఏమో గానీ.. పరశురామ్ మరో హీరోను చూసుకున్నాడు. స్టార్ హీరోలతో విసిగిపోయిన పరశురామ్ త్వరలో యంగ్ హీరోను సెలక్ట్ చేసుకున్నాడట. సరైన్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ను డైరెక్ట్ చేస్తాడని తెలిసింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న అఖిల్... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. అయితే స్టార్ ని డైరెక్ట్ చేయాలన్న పరశురామ్ కల మాత్రం తీరడం లేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: