కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు చిన్న విరామం తరువాత, కొరటాల మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2న మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన 'సైరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. నేడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో కలిసి సైరా విజయవంతమైనందుకు విందు ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ తో పాటు పరిశ్రమలోని ప్రముఖ నటులు, దర్శకులను ఈ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. చిరంజీవి, చరణ్ లతో పాటు మెగా హీరోలైన వరుణ్, ధరమ్ తేజ్, అల్లు శిరీష్ విందుకు హాజరై సందడి చేశారు.
ఇక 'సైరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ తో ఋజువైంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండవ రోజున 10.2 కోట్ల షేర్ ను సాధించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుకుగానూ 47 కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు.