స్టైలిష్ స్టార్ అల్లు  అర్జున్ -  స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్  కలయికలో వస్తోన్న  'అల వైకుంఠపురములో' సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు.  ఇక ఇటివలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.   సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు. అయితే  వచ్చే యేడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.  వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'అల వైకుంఠపురంలో' సినిమా ఒకటి.  తాజాగా  ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  ఈ డేట్ ఫైనల్ అని తెలుస్తోంది.  ఈ డేట్ కే  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇక  ఈ సినిమా  డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా..  శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా  రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం.  బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  


 పైగా  ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు.  అందుకే ఈ చిత్రానికి  ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.   ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.  కాగా  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ఇక  బన్నీ నిన్న కుటుంబం సమేతంగా ఏఎంబి థియేటర్స్ లో సైరా మూవీని వీక్షించడమే కాకుండా మూవీ పై మరియు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: