ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల వల్ల అక్కడ ఉంటున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆయన ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో లో ఆయన చాలా సన్నగా అయ్యారు. రానా ఆదివారం ఇండియాకి వచ్చినట్టు ట్వీట్టర్ వేదిక గా తెలిపారు.
నటుడు రానా ప్రస్తుతం " హౌస్ ఫుల్ 4 " అనే హిందీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన " హౌస్ ఫుల్ 4 " ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ లో రానా ఒక తోడేలు తో ఫైట్ చేస్తూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా లో బాలీవుడ్ కిలాడి
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ , పూజా హెగ్డే,
కృతి సనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కి ఫర్హాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓ ఆంగ్ల పత్రిక రానా పై రాసిన వార్త ఆయనకు ఆగ్రహాన్ని తెచ్చింది . విషయానికొస్తే " హౌస్ ఫుల్ 4 " సినిమా షూటింగ్ లండన్ లో జరిగింది. లండన్ షెడ్యూల్ కి రానా తన చెఫ్ ను తీసుకు వెళ్లడని. రానా ఏలాంటి భోజనం ఇష్టపడతాడో , ఏలాంటి డైట్ ఫాలో అవుతాడో చెఫ్ కు బాగా తెలుసని. లండన్ లో రానా బస చేసిన హోటల్లో రానా కోసం ప్రత్యేకంగా వంటకాలు తయారు చేసేవాడని రాసింది.ఈ విషయాన్ని ట్వీట్ కూడా చేసింది.
ఈ విషయం పై రానా స్పందించారు." నేను లండన్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొనలేదు. మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు" అని రానా కొప్పడ్డారు. దీంతో సదరు ఆంగ్ల పత్రిక ట్వీట్ ను డిలీట్ చేసింది.