ప్ర‌స్తుతం న‌య‌న్‌తార టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. ఏదైనా పెద్ద స్టార్ సినిమా వ‌స్తే ముందుగా హీరోయిన్ కోసం న‌య‌న్‌ను సంప్ర‌దించాల్సిందే. అలాంటి న‌య‌న‌తార సినిమా ఒప్పుకునే ముందు నిర్మాత‌ల‌కు ఖ‌చ్చితంగా కండీష‌న్లు పెడుతుంది. త‌ను ఆడియో ఫంక్ష‌న్‌కు గానీ, సినిమా ప్ర‌మోష‌న్స్‌, స‌క్సెస్ మీట్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌న‌ని ముందే తేల్చేస్తుంది. అయినా టాలీవుడ్‌, కోలీవుడ్ నిర్మాత‌లు న‌య‌న్ కండిష‌న్‌ను సంతోషంగా ఒప్పుకుంటారు.


అలా న‌య‌న్ ఎందువ‌ల్ల చేస్తుందంటే చాలాసార్లు తాను చెప్పింది ఒకటైతే, మీడియాలో వచ్చింది మరొకటని పేర్కొంది కథానాయిక నయనతార. తాను మీడియాను ఎందుకు దగ్గరకు రానీయదో తాజాగా 'వోగ్' మేగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. గతంలో మీడియాలో తన గురించి రకరకాలుగా రాశారని, అవి చూసి చాలా బాధపడ్డానని, అందుకే అప్పటి నుంచీ తాను మీడియాకు దూరంగా ఉంటానని ఆమె చెప్పింది. అయినా తాను చాలా ప్రైవేట్ పర్సన్ ని అనీ, ఎక్కువ ఎక్స్ పోజర్ కి ఇష్టపడనని తెలిపింది.


ఇదిలా ఉంటే మ‌రికొంద‌రి ప్రొడ్యూస‌ర్ల వాద‌న మ‌రోలా ఉంది. న‌య‌నతార సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పొల్గొన‌క‌పోవ‌డం వ‌ల్ల సినిమా ఖ‌చ్చితంగా హిట్ట‌వుతుంద‌నే సెంటిమెంట్ కూడా ప్ర‌బ‌లింది. అందుకే న‌య‌న కెరీర్ కూడా హ్యాపీగా దూసుకెళ్లిపోతుంది అని కొంద‌రు అంటున్నారు. నయనతార  ఆమె  ఎవ్వరికీ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం జ‌ర‌గ‌దు. తనపై ఏవన్నా అసత్యాలు ప్రచారం అయినా, లేదన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్ వైరల్ అయితే తప్ప నయన్ మీడియా ముందుకు రారు. అలాంటిది ఆమె ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ వోగ్ నిర్వహించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో నయన్‌తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ముగ్గురినీ ఒకే ఫ్రేంలో చూపిస్తూ తీసిన ఫొటోని మహేశ్ సతీమణి నమత్ర శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటో చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: