టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేశ్ బాబు  హీరోగా  వస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుండి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం  విడుదల చేసిన  పోస్టర్  ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  కాగా కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి  స్టైలిష్ లుక్ లో మహేష్   కనిపిస్తోన్నాడు.  కాగా తాజాగా ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే  ఓ స్పెషల్ సాంగ్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడనుంది.  ఇప్పటికే  ఈ ప్రత్యేక గీతంలో నటించేందుకు తమన్నా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఆగడు సినిమాలో మహేష్ బాబు సరసన  హీరోయిన్‌గా నటించిన తమన్నా.. ఇప్పుడు   'సరిలేరు నీకెవ్వరు' కోసం ఓ సాంగ్ లో నటిస్తోంది.  

అలాగే  ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది  బండ్ల గణేషేనట. ఒకరకంగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్,  అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో... ఈ సినిమాలో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట.  ఇక బండ్ల గణేష్  చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది.  ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్  సినిమాతో మళ్లీ   సినిమాల్లోకి  రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా  చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.  ఓ  అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా  పప్పు సుద్దలా..  ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట.  ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే  రైలు సీక్వెన్స్   సినిమాలోనే  చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట. 

కాగా  భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.   అలాగే ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న  ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో  రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.  2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: