గత మూడు సినిమాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ప్లాప్ లతో హీరో నితిన్  ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ  'భీష్మ'ని ఫైనల్ చేశాడు.   'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా  'భీష్మ'  చిత్రం ప్రస్తుతం శరవేగంగా  తెరకెక్కుతుంది. అయితే  ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని..  ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే  హైలెట్ గా  నిలవబోతుందట. 

మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా  ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట.  ఇక  ఈ సినిమాలో  ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.  కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర  బాగా బోల్డ్ గా  ఉంటుందట.  హెబ్బా - నితిన్ రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం. ఇక నితిన్  భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.  మరి కనీసం ఈ సినిమానైనా  నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి.  ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో  నితిన్ సరసన మెయిన్  హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది.

 ప్రస్తుతం నితిన్,  'భీష్మ'తో పాటు   వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ  అలాగే  విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ   ఓ సినిమా చేస్తున్నాడు.  కాగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో  రంగ్ దే  సినిమా లాంఛ్ అయింది.  స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సినిమా నిర్మాత  సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి  స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు.  ఇండియాలోని ఉత్తమమైన సినిమాటోగ్రఫర్లలో ఒకరు పీసీ. శ్రీరామ్.  ఈయన ఈ చిత్రానికి పనిచేయనున్నారు.  శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  'నాయకన్, క్షత్రియ పుత్రుడు, గీతాంజలి, అపూర్వ సోదరులు' లాంటి ఎన్నో సినిమాలకు గొప్ప ఛాయాగ్రహణం అందించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: