గత మూడు సినిమాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ప్లాప్ లతో హీరో నితిన్ ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ 'భీష్మ'ని ఫైనల్ చేశాడు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని.. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే హైలెట్ గా నిలవబోతుందట.
మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందట. హెబ్బా - నితిన్ రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం. ఇక నితిన్ భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి కనీసం ఈ సినిమానైనా నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది.
ప్రస్తుతం నితిన్, 'భీష్మ'తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో రంగ్ దే సినిమా లాంఛ్ అయింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఇండియాలోని ఉత్తమమైన సినిమాటోగ్రఫర్లలో ఒకరు పీసీ. శ్రీరామ్. ఈయన ఈ చిత్రానికి పనిచేయనున్నారు. శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'నాయకన్, క్షత్రియ పుత్రుడు, గీతాంజలి, అపూర్వ సోదరులు' లాంటి ఎన్నో సినిమాలకు గొప్ప ఛాయాగ్రహణం అందించారు.