ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకున్న అమెరికన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో మైసీ ఆర్యా స్టార్క్ అనే కీలక పాత్రలో నటించిన మైసీ విలియమ్స్. ఆ సినిమా షుటింగ్‌లో తనకు ఎదురైన బాధాకరమైన విషయాన్ని ఈ మధ్య చెప్పుకుంది. ఒక సినిమాలో నటిస్తామని ఒప్పుకుంటున్నామంటే ఎంత కష్టమైనా భరించాల్సిందే. అవి ఎటువంటి సీన్స్ఐనా చేయక తప్పదు. ఒకవేళ మనవల్ల కాదు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ముందుగానే చెప్పేయాలి. కాని సినిమా విడుదలై సక్సెస్ అయ్యాక దాని గురించి గొప్పగాచెప్పకుండా, చేదు సంఘటనలు చెప్పుకుని బాధపడకూడదు. అనుకుంటూ బాధపడుతుంది హాలీవుడ్ నటి మైసీ విలియమ్స్..


ఇంతకు ఏం జరిగిందంటే అమెరికన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఆమె చిన్న పిల్లలా కనిపించాలి. ఇందుకోసం మైసీ రొమ్ములు పెద్దగా కనిపించకూడదని టేప్‌లతో కట్టేశారట. ఈ విషయాన్ని మైసీ మీడియా ముందు చెప్పుకుని బాధపడింది. ‘నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇప్పుడు నా వయసు 22. సంవత్సరాలు. కన్నె పిల్లను కావడంతో నా శరీరంలో ఎన్నో మార్పులు జరిగాయి. నా రొమ్ములు పెరిగాయి. కానీ ఈ సిరీస్‌లో నేను చిన్న పిల్లలా కనిపించాలి. దాంతో నా రొమ్ములు కనిపించకూడదని రూపకర్తలు వాటి చుట్టూ టేప్‌ కట్టేశారు. అది నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.


ఈ సిరీస్ విడుదలయ్యాక దాదాపు ఆరు నెలల పాటు అద్దంలో నన్ను నేను చూసుకోవడానికి ఎంతో సిగ్గుపడ్డాను. ఇప్పుడు ఆ సిరీస్ ఎటూ అయిపోయింది కాబట్టి నాలో ఉన్న ఆడపిల్లలను ప్రపంచానికి చూపించుకునే అవకాశం వచ్చింది’అని చెప్పింది. నీకు అంత ఇబ్బంది కలిగినప్పుడు ఈ సిరీస్ నుండి తప్పుకోవచ్చుకదా,అంత బాధను అనుభవిస్తూ ఎందుకు నటించారు ఇప్పుడు ఆ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాక రూపకర్తలు ఇలా చేశారు అలా చేశారని చెప్పడం సబబు కాదని క్లాస్ పీకుతున్నారు ఈ వార్త విన్న కొందరు నెటిజన్స్. ఇక ఈ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరదలు సోఫీ టర్నర్ కూడా కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ఏప్రిల్‌ 2017 లో మొదలై. 2019 మే వరకు కొనసాగిన ఈ సిరీస్ నుండి దాదాపు ఎనిమిది సీజన్లు విడుదలయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: