టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఇకపోతే ఎప్పటికపుడు సినిమాలతో పాటు తన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి గడపడానికి ఇష్టపడే మహేష్ బాబు, 

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ కు కొంత సమయం బ్రేక్ రావడంతో, ఈ బ్రేక్ లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కి వెళ్లడం జరిగింది. ఇక అక్కడికి వెళ్లిన తరువాత ఆయన భార్య నమ్రత గారు, వారి టూర్ లో ఎంజాయ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే నేడు కాసేపటి క్రితం మహేష్ బాబు, తన ఫ్యామిలీతో కలిసి దిగిన  లేటెస్ట్ ఫోటో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో మహేష్ మరియు ఆయన తనయుడు గౌతమ్ సూట్ వేసుకుని ఉండగా, 

నమ్రత గారు మరియు సితార పాప ఎంతో గ్రాండ్ గా డ్రెస్ వేసుకుని ఉండడం గమనించవచ్చు. ఇక వారు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ దిగిన ఆ ఫోటోపై పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంతో తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు టూర్ కి వెళ్లి ఐదు రోజులు కావడంతో, ఆయన టూర్ ని నుండి తిరిగి వచ్చిన వెంటనే సరిలేరు సినిమా తాజా షెడ్యూల్ మొదలవనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య రిలీజ్ కానున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: