గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1, కన్నడ తో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఫీల్ తో తీసిన ఈ సినిమాను పలు ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసారు యూనిట్ సభ్యులు. అప్పట్లో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టి సంచలన విజయాన్ని నమోదుచేసుకున్న ఈ సినిమా రెండవ భాగమైన చాప్టర్ 2, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి భాగంలో కేవలం కొన్ని సెకన్ల పాటు తళుక్కుమన్న అధీరా క్యారెక్టర్, 

ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మారనున్నట్లు సమాచారం. ఇక ఆ కీలక పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే నేడు దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా యూనిట్ కి మన టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ప్రత్యేక విందును ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అట, కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం కథను వినిపించడానికి ఎన్టీఆర్ ఇంటికి కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ విచ్చేసిన సమయంలోనే, ఎన్టీఆర్ ఆ సినిమా టీమ్ మొత్తాన్ని రాబోయే దసరా పండుగ నాడు తమ ఇంటికి విందుకు రమ్మని ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు. 

ఇక నేడు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి కెజిఎఫ్ టీమ్ సభ్యులు ఎంతో ఆనందంగా విందులో పాల్గొన్నారని అంటున్నారు. ఇక దీనిని బట్టి ప్రశాంత్ నీల్ త్వరలో చేయబోయే సినిమా ఎన్టీఆర్ తో నే అని కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమతో ప్రశాంత్ నీల్ కు ఒక సినిమా ఒప్పందం ఉంది అని ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని చెప్పడంతో, తప్పకుండా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల సినిమా వారి సంస్థలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: