ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు నడుస్తోంది. అయితే ఎన్నో కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని విధంగా యావరేజ్ టాక్ రావడం, అలానే మెల్లగా రోజురోజుకు కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పడుతుండడంతో సైరా యూనిట్ కొంత ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డల్ అయిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరింతగా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి మంచి ఆలోచనతో స్వాతంత్రోద్యమ కథా నేపధ్యాన్ని ఎంచుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, దానిని తెరపై ప్రేక్షకుడికి నచ్చేలా చూపించడంలో మాత్రం చాలా వరకు దెబ్బతిన్నట్లు చెప్తున్నారు మెజారిటీ ప్రేక్షకులు. 

సినిమాలో ల్యాగ్స్ ఎక్కువయ్యాయని, ఎంటర్టైన్మెంట్స్ అంశాలు అసలు లేకవడం, ఇక మరీ ముఖ్యంగా రన్ టైం సినిమాకు చాలా పెద్ద నష్టం చేకూర్చినట్లు చెప్తున్నారు. అయితే మరికొద్దిరోజుల్లో తెరకెక్కబోయే మెగాస్టార్, కొరటాల కాంబినేషన్ మూవీలో మాత్రం అటువంటి తప్పులు చేయకూడదని నిర్ణయించారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ తో పాటు మెగా ఫ్యాన్స్ సహా ప్రేక్షకులందరూ మెగాస్టార్ నుండి ఆశించే అన్ని రకాల కమర్షియల్ అంశాలు దర్శకుడు కొరటాల మేళవించినట్లు సమాచారం. ఇక సాంగ్స్ విషయమై కూడా కొరటాల ఎంతో శ్రద్ధ వహించారని, 

అయితే సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆయన ఖాళీగా లేకపోవడంతో ఆయన స్థానంలో సైరాకి మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేదిని తీసుకోవచ్చని అంటున్నారు. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి నుండి ఫ్యాన్స్ కోరుకునే పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కబోయే ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ సాదిస్తుందని యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు సమాచారం. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో నటించే మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: