వివాదాస్పద కామెంట్స్ కు ఎప్పుడు చిరునామాగా కొనసాగే పృథ్వీ ఈ మధ్య శ్రీవెనక్తెస్వారా ఛానల్ చైర్మన్ అయిన తరువాత తన కామెంట్స్ కు మరింత వేడిని పెంచాడు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న కులతత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువైపోవడంతో తాను ఇందాస్త్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది దర్శక నిర్మాతలు అవకాశాల కోసం తాను వారి వద్దకు వెళ్ళినప్పుడు ‘మావాడివేనా’ అంటూ అడిగిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు. దీనితో తాను ఏమి చెప్పాలో తెలియక సతమతమై పోతున్నప్పుడు శ్రీహరి అప్పట్లో తనకు ఇచ్చిన సలహాను ఇప్పుడు బయట పెట్టాడు.

తన పేరు తరువాత ‘రాజు’ అన్న అక్షరాలు పెట్టుకోమని శ్రీహరి సలహా ఇవ్వడంతో తాను తన పేరును పృథ్వీ రాజ్ గా మార్చుకున్న అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను నిజంగానే రాజుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అనుకుని అప్పట్లో కృష్ణంరాజు తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ తరువాత తాను ‘రాజు’ కాదు అన్న విషయం తెలుసుకుని కృష్ణంరాజు షాక్ అయిన విషయాన్ని తెలియ చేసాడు. 

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను అప్పట్లో ‘పృథ్వీ చౌదరీ’ అంటూ పేరు మార్చుకుని ఉంటే తనకు విపరీతంగా అవకాశాలు వచ్చి ఉండేవని పృథ్వీ అభిప్రాయపడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ తనకు పవన్ తో ఉన్న అభిప్రాయ భేదాలు సిద్దాంత పరమైనవి మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. తనకు పవన్ తో ఎటువంటి శత్రుత్వం లేదని చెపుతూ తనకు మెగా హీరోకు అందరితోను మంచి సంబంధ బాందవ్యాలు ఉన్నాయి అంటూ మెగా అభిమానుల మెప్పును పాడడానికి పృథ్వీ ప్రయత్నిస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: