తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 మరికొన్ని రొజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య అహ్లాదకర వాతావరణం నడిచినా రాను రాను పోటీ తీవ్రం అవుతుంది. ఫినాలేకి చేరుకోవడానికి ఒక్కొక్కరూ చాలా కష్టపడుతున్నారు.  మొన్నటి ఆదివారం పునర్నవి భూపాలం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మొన్నటి వరకు పునర్నవి ఒక్క బ్యాచ్ తోనే గడిపిందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. పునర్నవి కన్నా ముందు ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రతి ఒక్కరూ ఇదే కామెంట్స్ చేశారు. 

పునర్నవి కేవలం వరుణ్, వితిక, రాహుల్ ఈ ముగ్గురుతోనే పూర్తి స్థాయిలో గడిపిందని..ఒకదశలో రాహూల్- పునర్నవి మద్య ప్రేమ కూడా చిగురించిందని టాక్ కూడా వినిపించింది. అవన్నీ బిగ్ బాస్ లో కామన్ అని కొట్టి పడేసిన ఇంటి సభ్యులు కూడా ఉన్నారు.  కాకపోతే బిగ్ బాస్ నుండి బయటకొచ్చినా పునర్నవి రాహుల్ పై అభిమానం కొనసాగిస్తుంది. పున్న ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు రాహూల్ నిజంగా చాలా బాధపడ్డాడు. ఒకదశలో ప్రేక్షకులకు కూడా కంట తడిపెట్టించే సీన్ జరిగింది. 

ఈ నేపథ్యంలో పునర్నవి  ఇంటి సభ్యులు అంటే మొన్నటి వరకు తాను గడిపిన బ్యాచ్ కి మద్దతు ఇవ్వాలని ప్రచారంలోకి దిగింది.  రాహుల్ కి ఓటేసి ఆయన షోలో కొనసాగేలా చూడాలని ప్రేక్షకులను కోరుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా రాహుల్ మరియు వరుణ్ లకు ఓటు వేయాలని విన్నపం చేస్తుంది. అయితే మహేష్ విట్టా కూడా ఎలిమినేషన్ లో ఉండగా పునర్నవి అతనికి సపోర్ట్ చేయడకపోడం గమనార్హం. ఆమె పరోక్షంగా రాహుల్, వరుణ్ లను గెలిపించి, మహేష్ ని ఇంటికి పంపండీ అంటూ చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: