స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్  సీజన్ 3 తెలుగు సో సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు ఎలిమినేషన్ లు  లో కామనే  కాబట్టి... బిగ్ బాస్ హౌస్ లో కామ్ గా ఉన్నవారు ఎలిమినేట్ అయ్యి  బయటకు వచ్చిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అందరి చూపు ఆకర్షించిన పునర్నవి భూపాలం... రాహుల్ సిప్లిగంజ్ తో సందడి చేసింది. ఇక డెబ్బై ఆరు రోజుల పాటు హౌస్ లో  కొనసాగిన పునర్నవి భూపాలం... హౌస్ లో ఎలిమినేట్ అయినప్పుడు కూడా తాను ఎలిమినేట్ అయినందుకు రాహుల్ చిన్నపిల్లల ఏడుస్తున్నప్పటికీ పునర్నవి భూపాలం మాత్రం హుందాగా  అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. 

 

 

 

 

 అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి భూపాలం తన సోషల్ మీడియా ఖాతాలో  ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. బిగ్ బాస్ హౌస్ లో 76 రోజుల పాటు ఉన్న పునర్నవి భూపాలం కి క్రేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. దీంతో పునర్నవి భూపాలం ఏ పోస్ట్ పెట్టినా అది నెట్టింట్లో వైరల్ అవుతుంది నెటిజన్లను  ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుంచి  ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది పునర్నవి . కాగా ఇప్పటికే బిగ్ బాస్ శ్రీముఖి హెల్ప్ చేస్తున్నాడని శ్రీముఖి ని స్పెషల్ గా  ఫోకస్ చేసి విన్నర్ గా  చూపిస్తున్నడని సంచలన వ్యాఖ్యలు చేసింది పునర్నవి భూపాలం. 

 

 

 

 

 ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో జరిగిన బాడీ డామేజ్ హార్ట్  డ్యామేజ్  నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు కూడా కంటెస్టెంట్స్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పునర్నవి భూపాలం. తాను బిగ్ బాస్ లోకి ఫేమ్ కోసం డబ్బు కోసం వెళ్లలేదని పునర్నవి తెలిపింది. వెళ్లేముందు ఒక్కసారి కూడా తాను బిగ్ బాస్  చూడలేదని... కానీ శ్రీముఖి శివజ్యోతి మాత్రం వివిధ భాషల్లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ లు అన్ని  చూసి బాగా ప్రిపేర్ అయ్యే  బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారని తెలిపింది . కాగా  హౌస్ లో కూడా  ఎక్కువగా గత  సీజన్ల గురించే డిస్కషన్ చేసుకునే వారిని కూడా  తెలిపింది. బిగ్ బాస్ 3 షో ప్రారంభమై రెండు రోజుల ముందు తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం అందిందని నిర్వాహకులు తెలిపారు అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: