బయోపిక్..ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఎందుకంటే బయోపిక్స్ ని తెరకెక్కించే విషయంలో దర్శక, నిర్మాతలకు, రచయితలకు ఒక సవాల్ గా ఉంటుంది. వీటి మీద ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తుంటారు. అయితే సినిమా, రాజకీయ నాయకుల బయోపిక్స్ అయితే మేకోవర్, మేనరిజం తో సరిపోతుంది. కానీ క్రికెటర్స్, బ్యాడ్మింటన్..బయోపిక్స్ అంటే మాత్రం ఆ పాత్ర పోషిస్తున్న నటులకు పెద్ద రిస్కే. ఇక బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ బయోపిక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓవైపు పుల్లెల గోపిచంద్ బయోపిక్.. మరోవైపు సానియా బయోపిక్ గురించి వైరల్ గా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సైనా బయోపిక్ పైనా అందరికీ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ బయోపిక్ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా.. రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతు వస్తుంది.

ముందు సైనా పాత్రకు శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్. శ్రద్ధా చాలా కాలం బ్యాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుంది. కాని నిర్మాతలతో మనస్ఫర్థలు వచ్చి ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పరిణీతి చోప్రా ఈ బయోపిక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పరిణీతి బ్యాడ్మింటన్ అకాడెమీలకు వెళ్లి చెమటోడుస్తోంది. బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ అచ్చం సైనాలా ఆడేందుకు చాలానే కష్టపడుతోంది.

సైనా బాడీ లాంగ్వేజ్ సహా ప్రతి విషయంలోను అచ్చం అలానే నటించడానికి ప్రయత్నం చేస్తోంది. తాజాగా థానే బ్యాడ్మింటన్ అకాడెమీలో ప్రాక్టీస్ చేస్తు చెమటలు చిందిస్తుంది. అందుకే పరిణీతి ఫ్యాన్స్ డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు అఛీవ్! అంటూ పరిణీతిని ఎంకరేజ్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తూ పాన్ ఇండియా కేటగిరీలో చేర్చడానికి దర్శక, నిర్మాతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: