రాజశేఖర్ జీవిత దంపతులు తమకు సినిమాలు ఉన్నా లేకపోయిన ఎప్పుడు మీడియాలో హాట్ న్యూస్ లకు చిరునామాగా మారుతూ ఉంటారు. వీరిద్దరూ రాజకీయాలలో రాణించాలని అనేక పార్టీలు మార్చినా ఎక్కడా వీరికి తగ్గ గుర్తింపు దక్కడం లేదు. ఈ పరిస్థితుల నేపధ్యంలో తిరిగి రాజశేఖర్ హీరోగా తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ వరసగా సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. 

లేటెస్ట్ గా జీవిత ఒక ప్రముఖ ఛానల్ లో అలీ నిర్వహిస్తున్న టాక్ షోకు అతిధిగా వచ్చి అనేక ఆసక్తికర విషయాల పై తన అభిప్రాయాలు తెలియ చేసింది. ‘తలంబ్రాలు’ సినిమాలో నటిస్తున్నప్పుడు తనకు రాజశేఖర్ కు ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారిన విషయాలను వివరిస్తూ రాజశేఖర్ పై ఒక షాకింగ్ సెటైర్ వేసింది. 

‘తలంబ్రాలు’ మూవీలో రాజశేఖర్ విలన్ పాత్రను పోషించడంతో ఆ తరువాత తాను రాజశేఖర్ ను ప్రేమించడం మొదలు పెట్టాక ‘ఫ్రాడ్’ అంటూ ముద్దుగా రాజశేఖర్ ను పిలిచిన విషయాలను గుర్తుకు చేసుకుంది. అయితే తాను రాజశేఖర్ ను పెళ్ళి చేసుకున్న తరువాత రాజశేఖర్ తల్లి తన నోటి వెంట తరుచు వచ్చే ‘ఫ్రాడ్’ పిలుపు విని ఆమె షాక్ అవ్వడమే కాకుండా అలా పిలిస్తే తాను అంగీకరించను అనీ గట్టిగా చెప్పడంతో ఆ తరువాత ఆ అలవాటు మార్చుకుని రాజశేఖర్ ను ‘బంగారం’ అంటూ తన పిలుపు మార్చుకున్న విషయాలను బయట పెట్టింది. 

ఇదే సందర్భంలో చిరంజీవి గురించి మాట్లాడుతూ తమకు చిరంజీవికి మధ్య ఎటువంటి గ్యాప్ లేదనీ ఈ వార్తలు అన్నీ మీడియా సృష్టి అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్ అక్కినేనిల తరువాత ఆ స్థానం అందుకోగల అర్హత ఒక్క చిరంజీవికి మాత్రమే ఉంది అని అంటూ మిగతా హీరోలు ఎంత మంది ఉన్నా చరిత్రలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల తరువాత ఒక్క చిరంజీవి మాత్రమే మిగులుతాడు అంటూ జీవిత షాకింగ్ కామెంట్స్ చేసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: