బుధవారం బిగ్ బాస్ లో నాగార్జున కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించి వాళ్ళతో దసరా సంబరాన్ని జరుపుకున్నారు. అయితే నాగార్జున ఆడించిన స్టార్ ఆఫ్ ద్ హౌస్ గేమ్ లో కంటెస్టెంట్స్ అందరూ ఘోరమైన తప్పు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తప్పు వల్ల వాళ్ళు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. హౌస్ లో  మీకు నచ్చిన స్టార్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే, అందరూ తమకు నచ్చిన వారిని స్టార్ కంటెస్టెంట్ గా చూపించారు తప్పితే, ఒక్కరు కూడా తామే స్టార్ ఆఫ్ ద హౌస్ అని ఎవరూ చెప్పలేకపోయారు.


అది వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడమో మరేంటో అర్థం కావట్లేదు. హౌస్ లో వాళ్ళు గేమ్ ఆడుతున్నారన్న విషయం కంప్లీట్ గా మర్చిపోయినట్టున్నారు. మిగతా వారికంటే వారి ఆటపైనే  ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళు తామే స్టార్ అని చెప్పలేకపోయారు. గత సీజన్లలో  ఇలాంటి అవకాశం వచ్చినపుడు ప్రతీ ఒక్కరూ తామే స్టార్ అని చెప్పుకున్నారు. ఈ సీజన్ లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అదీ గాక గేమ్ స్టార్ట్ అవగానే ఎవరెవరు ఎవరికి స్టార్ ఇస్తారనేది తెలిసిపోయింది.  దీనివల్ల గేమ్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది.


బిగ్ బాస్ చివరి దశకు వస్తున్న సమయంలో కూడా హౌస్ మెంబర్స్ ఇలా ప్రవర్తించడం విచిత్రంగా ఉంది. శీవజ్యొతి ఆలీకి, ఆలీ శివజ్యోతికి, శ్రీముఖి , బాబా భాస్కర్ లు వారిద్దరికీ, వరుణ్, వితికా తామిద్దరికీ ఇచ్చుకున్నారు. ఇక్కడ ఒంటరిగా ఉన్న మహేష్ సైతం తనకు తాను ఇచ్చుకోకుండా శివజ్యోతికి స్టార్ ఇచ్చి సేఫ్ గేమ్ ఆడాడు. మొత్తానికి హౌస్ మెంబర్స్ అందరూ తాము గెలవడానికి కాకుండా పక్క వారిని గెలిపించడానికే వచ్చినట్టు కనిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: