సాధారణంగా ఒక సెలెబ్రెటీ తనకు ఉన్న బలహీనతలు బయట పెట్టుకోవడానికి అంగీకరించరు. అయితే మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన శృతిహాసన్ తన కెరియర్ గురించి అనేక విషయాలను షేర్ చేస్తూ తన బలహీనతలను బయట పెట్టుకోవడం ఆ షోను చూస్తున్న వారికి షాక్ ఇచ్చింది. శృతిహాసన్ కొన్ని అనుకోని పరిస్థితులు వల్ల మద్యానికి బానిస అయిందట. 

ఈ అలవాటు నుండి బయటపడటానికి చాల కష్ట పడ్డాను అని చెపుతూ ఈ అలవాటు వల్ల తనకు అనారోగ్య సమస్యలు కూడ వచ్చాయన్న విషయాన్ని ధైర్యంగా బయట పెట్టింది. దీనివల్ల కొంత కాలం తాను సినిమాలకు దూరం అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని అంగీకరిస్తూ తన లవ్ ఎఫైర్ బ్రేకప్ గురించి తాను జీవితంలో చేసిన పొరపాట్ల గురించి అనేక ఆ సక్తికర విషయాలు ఈ షోలో షేర్ చేసింది. 

ఇదే సందర్భంలో తాను తెలుగులో నటించినటాప్ హీరోలు మహేష్ బన్నీ చరణ్ ల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఏ సినిమాలో ఏ హీరోతో నటించినా ఆ హీరోతో ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అనిపించలేదనీ అయితే మహేష్ తో ‘శ్రీమంతుడు’ మూవీలో నటిస్తున్నప్పుడు మాత్రం అతడిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అనిపించినా నమ్రత గుర్తుకుకు వచ్చి తన ఆలోచనలు మారిపోయాయి అని జోక్ చేసింది. 

ఇక అల్లు అర్జున్ తో లేచిపోయి జూనియర్ ను చంపాలని అనిపించింది అంటూ మరో షాకింగ్ జోక్ చేసింది. దీనికి కారణం బన్నీతో నటిస్తున్నప్పుడు పెద్ద శ్రమ అనిపించదు కానీ జూనియర్ తో నటిస్తున్నప్పుడు అతడితో సమానంగా నటించలేక తనకు చుక్కలు కనపడినప్పుడు తనకు జూనియర్ ను చంపెద్దాము అన్న కోపం వచ్చిన సందర్భాలు వివరిస్తూ టాప్ హీరోల పై జోక్స్ పేల్చింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: