చిరంజీవి సినీ కెరీయర్ లోనే మొదటి చారిత్రాత్మక సినిమాగా ... ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన సైరా నరసింహారెడ్డి సినిమా మంచి విజయం సాధించింది. చిరంజీవి కెరీయర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా... చిరంజీవి సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే సురేందర్ రెడ్డి ఈ సినిమా దర్శకత్వం వహించగా... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం... అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఈ సినిమాకు మించిన సినిమా తన కెరీర్ లో రాదని చిరంజీవి మీడియా ముందు కూడా తెలిపిన విషయం తెలిసిందే.
అయితే సైరా నరసింహారెడ్డి సినిమా టాక్ పరంగానే కాకుండా వసూళ్ల పరంగా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి మంచి ఫేమ్ ఉన్న నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇక మెగా స్టార్ చిరంజీవి తన నటనతో చిరంజీవిని మించి నరసింహ రెడ్డి ని ఊహించేలేనంతగా పాత్రలో జీవించి నటించారు.
అయితే ఈ సినిమా మెగా అభిమానులకు దసరా పండుగ ముందే పండుగ జరుపుకునేల చేసింది . తాజాగా ఈ సినిమా సక్సెస్ ను పురస్కరించుకుని టిఎస్ఆర్ సైరా చిత్ర యూనిట్ కు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కాగా ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు . కాగా ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. సైరా చిత్రబృందం సహా విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ వేడుకకు హాజరైన నందమూరి బాలకృష్ణ సరదాగా గడుపుతూ సందడి చేశారు.